NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌ధానిగా ముస్లిం ఎన్నిక‌యితే.. !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని దస్నాదేవీ ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింగానంద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ప్రధానిగా ఓ ముస్లిం ఎన్నికయితే వచ్చే 20 ఏళ్లలో 50 శాతం హిందువులు, ఇస్లాంలోకి మారతారని వ్యాఖ్యానించారు. తమ మనుగడ కోసం హిందువుల్లో ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని కూడా పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ‘హిందూ మహాపంచాయత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ ప్రసంగం తాలూకు వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌ అవుతోంది. ‘2029లో, లేదంటే 2034లో, లేదంటే 2039లో భారత్‌కు ప్రధానిగా ఓ ముస్లిం ఎన్నిక కావొచ్చు. ఒకసారి ప్రధానిగా ముస్లిం ఎన్నికయితే.. ఆ తర్వాత ఇరవై ఏళ్లలో హిందువుల్లో సగం మంది ఇస్లాంలోకి మారతారు. హిందువుల్లో మిగిలిన వారిలో 40ు మందిని చంపేస్తారు. అప్పుడు మిగిలిన 10ు మంది శరణార్థ శిబిరాల్లో నివసిస్తారు. లేదంటే ఇతర దేశాలకైనా వెళతారు. ఇదీ హిందువుల భవిష్యత్తు. ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా ఆయుధాలు చేతబట్టాలి’ అని నర్సింగానంద్‌ వ్యాఖ్యానించారు.

                                   

About Author