NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీసీ కావాలంటే… వాళ్లు చెప్పాలి..

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  విద్యార్థులకు టీసీ కావాలంటే… వాళ్లు చెప్పాలి.. మండలంలోని ఓ గ్రామంలో హెడ్మాస్టర్ సూచనలు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఒక పాఠశాల నుండి మరో పాఠశాలకు విద్యార్థులు వెళ్లడానికి  ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ప్రధానం. వివిధ కారణాల రీత్యా విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలు మారుతుండడం సహజం . కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మంజూరు చేయడానికి అభ్యంతరాలు ఎందుకని కొందరి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ఫర్  సర్టిఫికెట్ మంజూరు చేయడంలో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం పై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. పాఠశాలలకు లేదా కళాశాలలకు ఫీజుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం బకాయిల రూపంలో ఉంటే బకాయిలు చెల్లిస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పే హక్కు ఉండి ఉండవచ్చు. పాఠశాలల్లో పాఠశాల అభివృద్ధి కొరకు ఒక కమిటీ దానికి చైర్మన్, మెంబర్లు ఉంటారు. కానీ పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలని ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల విషయంలో రాజకీయ జోక్యంపై తీవ్ర దుమారం రేగుతున్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డు తిరగడంతో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *