జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం
1 min read
ప్రారంభోత్సవం లో సీఎంతో పాటు పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస నేడు: గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసేందుకు కర్నూల్ జిల్లా జొన్నగిరికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గోల్డ్ మైనింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సీఎంతో కలిసి మంత్రి సందర్శించారు. అనంతరం ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండవ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు.


