పనిచేయని వీసీ..ఇబ్బందుల్లో అధికారులు
1 min read
వీసీ మరమ్మతులకు నోచుకునేదెన్నడు.?
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (స్పందన) కార్యక్రమాన్ని స్వయంగా జిల్లా కేంద్రంలో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల కేంద్రాల్లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా మండల అధికారులు జిల్లా కలెక్టర్ కు అధికారులు లైవ్ లో అందుబాటులో ఉండాలి. మండల ప్రజలు ఏమైనా సమస్యలతో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ జి రాజ కుమారి దృష్టికి మండల ప్రజలు తీసుకు వెళ్తే ఆ సమస్యను కలెక్టర్ మండల అధికారుల దృష్టికి వీడియో కాన్ఫరెన్స్ లైవ్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తారు.కానీ గత రెండు నెలలుగా నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ పని చేయకపోవడంతో మండల అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీసీ పనిచేయకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.నిన్న ఎంపీడీవో పి దశరథ రామయ్య,తహసిల్దార్ టి శ్రీనివాసులు,ఈఓఆర్డి సంజన్న,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్ తమ మొబైల్ లోనే వీడియో కాన్ఫరెన్స్ చూశారు.మండల ప్రజలు పలు రకాల సమస్యల గురించి అధికారులకు వినతి పత్రాలను అందజేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన వీడియో కాన్ఫరెన్స్ మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
