కేంద్రం రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్దరించాలి
1 min read
ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో కలక్టరేట్ వద్ద నిరసన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు పునరుద్ద రించి కలం కార్మికులైన జర్నలిస్ట్ లకు న్యాయం చెయ్యాలని ఏపిడబ్ల్యూజె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్ శంకరరావు డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఇక్కడ కలెక్టరేట్ మీడియా పాయింట్ వద్ద ఎపి డబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లతో జర్నలిస్ట్ లునిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షులుఎస్.డి జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన లో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు,రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై వత్తిడి తెచ్చి పునరుద్దరణ అయ్యే టట్టుచూడాలని నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలు సమయం లో ఇచ్చిన హమీలు అమలు చెయ్యాలని కోరారు.పని చేసే జర్నలిస్ట్ లు అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రిటిడేషన్ ఇవ్వాలని,ప్రతి వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు.సీనియర్ పాత్రికే యులకు తమిళ నాడు,కేరళ పంజాబ్ రాష్టాల్లో మాదిరి గా యాభై ఏళ్ళు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు.ఈ నెల 11వ తేదీన మండల కేంద్రాల్లో ఎపి డబ్ల్యూ జెఎఫ్ తలపెట్టిన ధర్నా లో పాత్రికేయ సోదరులు అందరూ పాల్గొని అక్కడతహసీల్దార్ లకు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని పేర్కొన్నారు.ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్ జర్నలిస్ట్ ల ఐక్యత గురించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్లు కె.బాలశౌరి,ఎం.గంగ రాజు,వీరఘట్టం. జయరాం,వై.హరీష్,యర్రా.జయదాసు, మిల్టన్,దొరబాబు, సన్నీ,బాబ్జి,అర్జున్,నవీన్, ప్రతాప్,సత్యనారాయణ, శ్రీనివాస్,సజ్జి మెథ్యూస్,రమేష్, షాజహాన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
