NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన నాయకులు..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  గుంటూరులోని కార్యాలయం నందు నూతనంగా తెలుగుదేశం పార్టీ వడ్డెర వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ను శుక్రవారం గుంటూరులో కార్యాలయంలో మల్లెల ఈశ్వర్ రావును మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మైనింగ్ నందు వడ్డెరులకు రిజర్వేషన్ రాయితీ కల్పిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది.క్వారీల నందు హక్కులు కల్పిస్తూ శ్రామిక శ్రమ జీవులైన వడ్డెరలను గుర్తించినందుకు మన నంద్యాల జిల్లా వడ్డెర సంఘ నాయకుల అందరం కలిసి కూటమి ప్రభుత్వానికి మంత్రి లోకేష్ బాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలుపుతున్నామని అన్నారు.అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చి వడ్డెరలపై ప్రేమ చూపిస్తున్నందుకు అత్యంత వెనుకబడిన మా యొక్క వడ్డెర కమ్యూనిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మా అభివృద్ధికి పాటుపడుతూ మా హక్కులు సాధించుకోవడానికి సహాయపడతారని అలాగే నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మరియు ఆత్మకూర్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వడ్డెర వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్ రావును కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలవడ్డెర సత్రం నందు జరుగుతున్నటువంటి జరపటి రాములు నియంత పాలనను అక్రమాలను,అసాంఘిక కార్యక్రమాలను దోపిడి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా పారద్రోలి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని మన యొక్క జాతి గొప్పతనాన్ని తెలుపుతూ  రాష్ట్రం వడ్డెర జాతి మొత్తం మీద పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నాయకులు వడ్డే గోగుల చక్రధర్(నంద్యాల జిల్లా అధ్యక్షులు),వడ్డే మద్దిలేటి,ఏడుకొండలు, లక్ష్మయ్య,బాబు,వడ్డే వీరాంజనేయులు, వడ్డేపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *