గతంలో ఎన్నడూ లేనంత 3 రోజులపాటు మహానాడు కార్యక్రమాలు
1 min read
సూపర్ సక్సెస్ చేసిన ఘనత టిడిపి శ్రేణులకె దక్కుతుంది
అనేక ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గతంలో ఎన్నడూ లేనంత వైభవంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడురోజుల పాటూ కడప గడ్డపై జరిగిన టిడిపి మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇదిచూసిన వైసిపి నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయంటూ చమత్కరించారు. మహానాడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అంశాన్ని శుక్రవారం ఏలూరులో మీడియాతో పంచుకున్న ఆయన కనీవినీ ఎరుగని రీతిలో మహానాడును సూపర్ సక్సెస్ చేసిన ఘనత టిడిపి శ్రేణులకే దక్కుతుందన్నారు. పార్టీమీద ప్రేమతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెల్లువలా తరలివస్తే ఇది గిట్టని వైసిపి అనేక విమర్శలు చేస్తోందన్నారు. ఏం చేయాలో పాలుపోక వైసిపి చేస్తోన్న పిచ్చిచేష్టలను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైసిపి ఎన్ని అవాంతరాలు సృష్టించాలని చూసినా మహానాడు విజయవంతానికి విశేషంగా కృషిచేసిన రాయలసీమ ప్రాంత నేతలకు, పెద్ద ఎత్తున తరలివచ్చిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ శ్రేణులకు ఎమ్మెల్యే చంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ యం ఆర్ పెదబాబు ఉన్నారు.