సిపిఐ ఏలూరు ఏరియా 6వ మహాసభలు జయప్రదం చేయండి
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు డేగా ప్రభాకర్
సిపిఐ పార్టీ ప్రతి మూడేళ్లకి ఒకసారి మహాసభలను
గోడ పత్రికను స్ఫూర్తి భవన్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సిపిఐ ఏలూరు ఏరియా 6వ మహాసభలు జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి 99 వసంతాలు పూర్తిచేసుకుని శత వసంతాలలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ వంద సంవత్సరాల కాలంలో సిపిఐ చేసిన పోరాటాలు ఉద్యమాలు ప్రజల పక్షాన నిలబడే వారి సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు సాగించిందని కొనియాడారు. ఏలూరు నగరంలో పేద ప్రజలకు సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని అనేక దశలలో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించి పేదలకు కమ్యూనిస్టు పార్టీ చెప్పిన విధంగా ఇళ్ల స్థలం ఇవ్వడానికి అంగీకరించింది. కనుక ఇళ్ల స్థలాలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.టిడ్కో ఇళ్లకు మౌలిక వస్తువులు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాగతంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుపుకునే మహాసభలు వచ్చే నెల 5,6,7 తారీకుల్లో చింతలపూడి మండలంలో, రాష్ట్ర మహాసభలు ఆగస్టు నెలలో ఒంగోలు పట్టణంలో,జాతీయ మహాసభలు చండీగర్లో జరుగుతున్నాయని అందులో భాగంగా ఏలూరు ఏరియా ఆరవ మహాసభలు ఈనెల 21,22 తేదీలలో జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు నగరంలోని పారిశుద్ధ్యం,రోడ్లు, డ్రైనేజీ,వంటి సమస్యల పరిష్కారానికి ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తారని కావున ఏలూరు ఏరియా ప్రజలు సహకరించాలని తద్వారా మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కొంపల్లి కృష్ణమాచార్యులు,కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, మావూరి విజయ,16వ డివిజన్ కార్యదర్శి కొల్లూరి సుధారాణి,29వ డివిజన్ కార్యదర్శి గొర్లి స్వాతి,1వ డివిజన్ సహాయ కార్యదర్శి వెదురుపర్తి శారద,2వ డివిజన్ కార్యదర్శి లక్కోజు జగదీశ్వరి, జిల్లా సమితి సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు,యర్రా వెంకటేశ్వర రావు,బేతా శంకర్,శాయన అభిలాష్ కుమార్,పాల రామకృష్ణ, లక్ష్మీ, ఉప్పులూరి లక్ష్మీ,భవాని, అడ్డగర్ల సాకేత్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
