NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి

1 min read


పల్లెవెలుగు వెబ్: అస్సోంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చఠ్ పూజ అనంతరం భక్తులు ఇంటికి ఆటోలో తిరిగి వెళుతుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో 9 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈఘటన కరీంగంజ్ జిల్లా బైఠఖల్‌లో చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

About Author