NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది,ఇంటర్ ప్రతిభా విద్యార్థులకు..మంత్రి,కలెక్టర్ ప్రశంస

1 min read

విద్యార్థులకు 20 వేలు అందజేత..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : పదవ తరగతి మరియు ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజ కుమారి అభినందించారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో షైనింగ్ స్టార్స్ జిల్లాలోమంచి మార్కులతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమానికి   ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్,కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా మంత్రికి మరియు జిల్లా కలెక్టర్ కు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాణ్యం మోడల్ పాఠశాల 20 మంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.టాపర్ల విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లఅందజేస్తూ అభినందించారు.  రాబోయే రోజుల్లో అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలోని మండలాల వారీగాప్రతిభ విద్యార్థులకు ఒకరికి 20 వేల చొప్పున జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డితో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్జి జిల్లా అధ్యక్షుడు టి.తురో లింగారెడ్డి,లియో ఆంథోనీ,పాఠశాల ప్రిన్సిపాల్ దినేష్, ఫర్జాన మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *