హేలాపురి నగరంలో ‘నారి’ షోరూం ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి
1 min read
పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్, ఎస్ఎంఆర్ పెదబాబు
నా వ్యాపారాల అభివృద్ధికి సహకరించిన నగరవాసులకు రుణపడి ఉంటా
ప్రముఖ వ్యాపారవేత్త డెనిమ్ రామ్మోహన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక రామచంద్రరావు పేట నారీ షోరూం గురువారం ఉదయం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విచ్చేసి నూతన షోరూమ్ ను ప్రారంభించారు, ఈ ప్రారంభోత్సవంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్ , ఎస్ఎంఆర్ పెదబాబు ప్రముఖ వ్యాపారవేత్తలు విచ్చేసి వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా సామర్లకోటలో స్వస్థలమైన కార్పొరేటర్ మరియు డెనిమ్ రామ్మోహన్ గా ఏలూరులో సుపరిచేతులయ్యారు రామ్మోహన్. శాకోపశాఖలుగా వ్యాపార వృద్ధిని పెంచడానికి దానికి ప్రధాన కారణం ఏలూరు నగరవాసులు, వ్యాపారవేత్తలు,రాజకీయ ప్రముఖులు ఎంతో మంది తనకు ఆదరభిమానాలు అందించారని, తద్వారా నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఏలూరు నగర ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు ఎంతో రుణపడి ఉంటానని డెనిమ్ రామ్మోహన్ తన మనసులో మాటను సంతోషంగా వ్యక్తం చేశారు. తన కుమార్తె విజయవాడలో (నారీ మహిళ స్టూడియోను) ప్రారంభించి అనేక బ్రాంచీలు గా విస్తరించి నేడు ఏలూరు నగరంలో బ్రాంచ్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నన్ను ఆదరించినట్లే నా కుమార్తె ఏలూరు బ్రాంచ్ కూడా ఆదరించి మా వ్యాపారనికి మీ సహాయ సహకారాలు అందించాలని డెనిమ్ రామ్మోహన్ కోరారు.