ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు ఎమ్మెల్యే నివాళి…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గూడూరు నగర పంచాయతీలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు నివాళులర్పించిన కోడుమూరు శాసనసభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి .. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని కొత్త బస్టాండ్ దగ్గర నిన్న ఇంటి నిర్మాణం నిమిత్తం పునాది పనులు చేస్తుండగా తలారి మధు,కాకి సోమన్న ఇద్దరు కార్మికులు ప్రమాదశాత్తు మరణించారు.ఈ విషయం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి ఈరోజు గూడూరు నగర పంచాయతీకి చేరుకొని ఎస్సీ కాలనీలోని కాకి సోమన్న పార్థివదేహానికి మరియు తలారి మధు పార్థివదేహానికి పూలమాలలతో నివాళులర్పించి వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇరువురి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వైస్ ఛైర్మెన్ కె.రామాంజనేయులు,రేమాట వెంకటేశ్వర్లు,పౌలు,కౌన్సిలర్లు రేమాట సురేష్,మల్లాపు బుడ్డంగలి,కలాం బాష,కర్ణ,చికెన్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు.