మున్సిపాలిటీ అధికారులకు..ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం
1 min read
రచ్చ రచ్చగా మున్సిపల్ కౌన్సిల్
ప్రతినెలా ఎందుకు సమావేశాలు పెట్టలేదు
మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..
ఎమ్మెల్యే జయసూర్యకు కోపం తెప్పించిన అధికారులు
భగ్గు మన్న వర్గ విభేదాలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మున్సిపాలిటీలో ప్రతినెలా కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఒక సంవత్సరానికి గాను ఆరు సమావేశాలు పెట్టారు.రెండు నెలలకు ఒకసారి సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? మీకు ఎవరు చెప్పారు పట్టణ అభివృద్ధి పట్ల మీకు బాధ్యత లేదా ప్రజల అవసరాలు మీకు పట్టవా అంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మున్సిపాలిటీ అధికారులపై నిప్పులు చెరుగుతూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఎమ్మెల్యే అడుగుతున్న ప్రశ్నలకు మున్సిపాలిటీ అధికారులు సమాధానాలు చెప్పలేక ఉండిపోయారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం జై కిసాన్ పార్కులో గురువారం జరిగిన పురపాలక కౌన్సిల్ సమావేశం మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం ఎమ్మెల్యే మరియు ఎంపీ శబరి రెండు వర్గాల కౌన్సిలర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.ముందుగా మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ పట్టణ అభివృద్ధి కొరకు వార్డుల తీర్మానాన్ని కౌన్సిల్ అనుమతి కొరకు చదివారు. సమావేశం ప్రారంభానికి ముందుగా ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్ చాంద్ భాష మాకు టేబుల్ ఏర్పాటు చేయలేదని కౌన్సిల్ లో కింద నేల పైనే కూర్చుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఓపెన్ స్థలాలు ఏమయ్యాయి పలు విషయాల గురించి నేను మొదటి సమావేశంలోనే చెప్పాను ఇంతవరకు నాకు మీరు ఎందుకు చెప్పలేదు మున్సిపాలిటీలో ఏం జరుగుతోందని అధికారులను నిలదీశారు.16 మంది కౌన్సిలర్ల మెజార్టీ మెజార్టీ మాకు ఉందని మేము ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించాలని కోరుతూ కౌన్సిలర్లు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,భాస్కర్ రెడ్డి మరియు మిగతా కౌన్సిలర్లు కలసి కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేసి వారు బయటకి వెళ్ళిపోయారు.మా వార్డులో చిన్న చిన్న పనులు కూడా మేము చేయలేకపోతున్నాం మేము ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని 28వ వార్డు కౌన్సిలర్ రాధిక అడగ్గా మీరు బయట ఓపెన్ గా చెబుతున్నారు మేము బయట చెప్పుకోలేక పోతున్నామని బ్యాలెన్స్ గా వెళ్తున్నామని మేము చేయాల్సిన పనులు ఉంటే మేము చేస్తామని మున్సిపాలిటీ కమిషనర్ బేబీ అన్నారు.ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో సీఐ లు సుబ్రహ్మణ్యం,ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంఈఓ సుభాన్, మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.