PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభిమానుల‌కు ఎన్టీఆర్ వార్నింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అభిమానుల‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల ముంబైలో జ‌రిగింది. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోనికి వచ్చి అరుపులు, ఈలలతో హల్‌చల్‌ చేశారు. స్టేజీ పైకి ఎక్కి హడావిడి చేయడంతో అక్కడున్న సెలబ్రిటీలు అసహనానికి గురయ్యారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ‘‘అందరూ కిందకు దిగుతారా? లేదా? ఇది పద్థతిగా లేదు.. కిందకు దిగండి? రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలి. అందరూ పద్థతిగా కిందకు దిగండి’’ అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

                                     
        

About Author