PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త ఏడాది లో ప్రజలు ఆనందంగా జీవించాలి

1 min read

– నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : కొత్త ఏడాది లో  నియోజకవర్గంలోని ప్రజలు ఆనందంగా జీవించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఆంగ్ల సంవత్సరాది ని పురస్కరించుకుని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అర్థరాత్రి 12 గంటల సమయంలో గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. వీఐపీ అతిథి గృహం లో ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, పోలీసు సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, కాచాపురం సర్పంచ్ వై. జయమ్మ , ప్రియాంక  చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. వైకాపా మండల అధ్యక్షులు జి. భీమిరెడ్డి , సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు, నియోజకవర్గ ప్రజలందరూ 2024లో సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తరుపున  ఎమ్మెల్యే తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author