సీజనల్ వ్యాధులపై గర్భవతులకు అవగాహన కల్పించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లో యుపిహెచ్సి – ఎర్రబురుజు లో నిర్వహించిన ఆశా సమీక్షా సమావేశములో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శాంతికళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా డే కు సంబందించిన ఎజెండా అంశాలలో బాగంగా, ఆశా యాప్ నందు అర్హులైన దంపతుల సేవలు , ఐరన్ మాత్రల పంపిణీ , విటమిన్ ఎ ద్రావణ పంపిణీ , నవజాత శిశు సేవల వివరాలను క్రమం తప్పక అప్లోడ్ చేయాలని సీసనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ , డయేరియా మొదలైన వాటి గురించి అవగాహన కల్పించాలని గర్భవతులకు 4 వ నెల నుండి ప్రసవానతరం బిడ్డకు ఒక సంII వయస్సు వచ్చు వరకు మాతా శిశు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కొరకు 01244451660 నెంబర్ నుండి వచ్చు కిల్కారి మేసేజ్ ల గురించి అవగాహన కల్పించాలని పట్టణ ఆరోగ్య కేంద్రం నందలి ఉచిత ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారు ఓ. పి సేవలకోరకు వచ్చేటప్పుడు ఆధార్ నెంబర్, మరియు ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చేటట్లు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అసంక్రమిత వ్యాధుల ( ఎన్సిడి 3.0 ) పై సర్వే త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో డిపిఎంఓ డాక్టర్ ఉమా , డెమో శ్రీనివాసులు శెట్టి, డిపిఓ విజయరాజు , వైద్యాదికారి డాక్టర్. తేజశ్రీ , డిప్యూటీ డెమో చంద్రసేకర రెడ్డి , ఆరోగ్య విద్యా భోదకురాలు పద్మావతి , ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.