NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

1 min read
రికార్డులను పరిశీలిస్తున్న కమిషనరు బాలాజి

రికార్డులను పరిశీలిస్తున్న కమిషనరు బాలాజి

సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
– కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు కార్పొరేషన్​ :ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సేవలు అందించాలని కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ స్పష్టం చేశారు. గురువారం నగరంలోని 49వ వార్డు కొత్తపేటలో ఉన్న 127, 128 వార్డు సచివాలయాలు, అలాగే సాయిబాబా సంజీవా నగర్ లోని 132వ వార్డు సచివాలయాలను మునిసిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్ మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని పరిశీలించారు. సచివాలయాల ద్వారా అందిస్తున్న సర్వీసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

About Author