NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూ.ఎన్టీఆర్ ను ప్ర‌శ్నించ‌డం వికృతానికి ప‌రాకాష్ఠ‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి నుంచి టీడీపీని దక్కించుకోవడం కోసం ఒకప్పుడు ఒక పోటు పొడిచి ఆయన మరణానికి కారకులైనవారు ఇవాళ ఆయనపై అతి ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. వారు జూనియర్ ఎన్టీఆర్ ను “నువ్వు వారసుడివా” అని వెక్కిరించడం, అవమానించడం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి, దగా రాజకీయాలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు.

                                     

About Author