NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

1 min read

రాహుల్ గాంధీ మంచి విజన్ ఉన్న నాయకుడు

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు

దేశ ప్రజల తరఫున ప్రశ్నించే ఏకైక గొంతుక

ఎమ్మిగనూరు  , న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎం కాసిం వలి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ  55వ  పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఉర్దూ పాఠశాలలో విద్యార్థులతో కలిసి  కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరు  మాట్లాడుతు రాహుల్ గాంధీ  మంచి విజన్ ఉన్న నాయకుడు,యువతకు ఆదర్శం,నిరంతరం దేశప్రజాసామ్యాలపై పోరాడుతూనే ఉంటాడు,కాంగ్రెస్ పార్టీ కి ఆశకిరణం,ధృవ తార అని,రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి  నీ చేసెంతవరకు వై యస్ షర్మిల రెడ్డి  నేత్రత్వం లో అహర్నిశలు పనిచేస్తామన్నారు. ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ  అని కొనియాడారు దేశంలో పేదరికం రోజుకు రోజుకు పెరిగిపోతుందని ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని అన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇలాంటి వృద్ధాశ్రమాలు నడుపుతున్నటువంటి ఎంతోమంది మానవత్వంతో ట్రస్టులు నడుపుతుంటే వాటికి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఉదాహరణకు ఆర్డిటి ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తున్నారు వైద్యం అందలేని వారికి వైద్యం అందిస్తున్నారు నిరుపేదలు చదువు లేని వారికి చదువు అందిస్తున్నారు మరి అలాంటి ఆర్డిటి సంస్థలనే నిధులు రాకుండా అడ్డుకుంటున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం వెంటనే ప్రతి పేదవానికి ఆదుకునేటువంటి ఆర్ డి టి సంస్థకు నిధులు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమములో  ఎన్​ఎస్​యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ ,నరసప్ప ,షబ్బీర్, లోకేష్, అజయ్ భాస్కర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *