NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంబరాల్లో రేషన్ డీలర్లు..తహసిల్దార్ కు సన్మానం

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : గత నాలుగు సంవత్సరాల కిందట వైకాపా ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం రైస్ ట్రక్కులను  తీసుకువచ్చింది.గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే నెల జూన్ 1వ తేదీ నుండి రేషన్ డీలర్లే స్వయంగా వారి ఇంటి వద్ద నుండి రేషన్ సరుకులను పంపిణీ చేయాలని అదేవిధంగా రేషన్ ట్రక్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో  రేషన్ డీలర్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.సోమవారం ఉదయం నంద్యాల జిల్లా మిడుతూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ టి శ్రీనివాసులును శాలువా పూలమాలలతో రేషన్ డీలర్లు ఘనంగా సత్కరించారు.రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ,మొల్ల చాకర్ వలి,గోకారి,నాగేంద్ర నాయుడు తహసిల్దార్ ను మరియు ఆర్ఐ జహంగీర్ ను సన్మానిస్తూ స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో డీలర్లు రఘు నారాయణ ఆనందం సోఫి సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *