NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిలే నిరాహార దీక్షలు….

1 min read

ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్

ఎమ్మిగనూరు , న్యూస్​ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు28/04/25  తేదిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సోమవారం నాడు ఎమ్మిగనూరు డిపోలో రీజనల్ అధ్యక్షులు ఎన్ . ఆర్.నాయుడు  అధ్యక్షతన డిపో అధ్యక్ష కార్యదర్శులు, ఎస్ . ఏం రఫీక్,ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో మా యొక్క న్యాయమైన డిమాండ్లను ప్లే కార్డుల ద్వారా ఎమ్మిగనూరు డిపో గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడనుండి నిరాహార దీక్షలను కూర్చోవడానికి సమకూర్చిన డేరా వరకు అందరూ నినాదాలు చేస్తూ నిరాహార దీక్షలకు గంగుండి నాగరాజు, ఎం. చంద్రయ్య, కే. తిమ్మప్ప కండక్టర్లను నిరాహార దీక్షలకు కూర్చోబెట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రింది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్లు:1/2019 భద్రతా సర్క్యులర్ ను అమలు చేయాలి .ఉద్యోగులకు డబుల్ డ్యూటీ అమౌంట్ పెంచాలి.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‌సంస్థ ద్వారా వేతనాలు పెంచాలి.ఉద్యోగులపై విధించే అక్రమ సస్పెన్స్,రిమూవల్స్ ఆపాలిపారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి.4 సంవత్సరాలుగా ఆగిపోయిన అన్నీ క్యాటగిరీల్లో ప్రమోషన్లు ఇవ్వాలి.మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు ఇవ్వాలి. నాన్- ఆపరేషన్ ఉద్యోగుల‌ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీవితం ఇవ్వాలి. ఈ హెచ్ ఎస్. స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలి.ఎలక్ట్రిక్ బస్సులను. ఆర్టీసీ./ప్రభుత్వం ద్వారా కొనాలి. ఆర్టీసీ. లో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రంత్ ను అమలు చేయాలి.రిటైర్డు ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణాలను అనుమతించాలి.ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి.ఉద్యోగులకు అవసరాన్ని బట్టి.ఈ ఓ ఎల్. మంజూరు చేయాలి. రీజనల్ అధ్యక్షులు నాయుడు  ప్రసంగించారు. అదేవిధంగా డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేస్తున్నామని 29వ తేదీ కూడా ఉంటుందని అందరూ ఇదే విధంగా ఉత్సాహంతో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో సంయుక్త కార్యదర్శి ఎం . ఎం.డీ.షరీఫ్ ,డిపో వర్కింగ్ అధ్యక్షుడు ఎన్. పి. ఎం. సాహెబ్, ఉపాధ్యక్షులు కె. ఎం.సాహెబ్,  ప్రచార కార్యదర్శులు బజారప్ప, ఎం. ఎల్. రెడ్డి,  గ్యారేజ్ కార్యదర్శి  భాస్కర్, ఎలక్ట్రిషన్ రాజకుమార్  తదితరులు పాల్గొన్నారు.

About Author