NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి సీబీఎస్సీ ఫలితాలలో రిడ్జ్ స్కూల్ ప్రతిభ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:     నేడు ప్రకటించిన సి బి యస్ ఇ పదవ తరగతి ఫలితాలలో రిడ్జ్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను సాధించారని పాఠశాల సిఇఓ జి.గోపినాథ్  తెలియజేశారు. మొత్తం 111 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 90% పైన 30 మంది విద్యార్థులు, 80% పైన 63 మంది విద్యార్థులు, 70% పైన 84 మంది విద్యార్థులు, 60% పైన 102 మంది విద్యార్థులు ప్రతిభ సాధించారు. టి. కేదార్ రెడ్డి 486 ,  ఎస్. నందిని రెడ్డి 479  , టీవీ. తేజోదయ్ 478,   వి. దాక్ష 475,   ఎస్. గౌతం 474 ,   పెరుగు లక్ష్మీ గాయత్రి 473, మార్కులతో ప్రతిభను చాటారు .ఈ  అద్భుత ప్రతిభను సాధించిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల సీఈవో జి. గోపీనాథ్ , కో సిఇఓ శ్రీమతి సౌమ్యాగోపినాథ్ ,డీన్ రాజేంద్రన్ ,ప్రిన్సిపాల్ ఎ.రాజ్ కమల్, కోఆర్డినేటర్ హరికృష్ణ లు  అభినందించారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *