PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవ్ ల‌క్షద్వీప్.. 93 మంది ఐఏఎస్ లు మోదీకి లేఖ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ల‌క్షద్వీప్ లో దారుణ ప‌రిమాణాలు చోటుచేసుకుంటున్నాయ‌ని, అడ్మినిస్ట్రేట‌ర్ ప్రపుల్ నిర్ణయాల‌ను తాము వ్యతిరేకిస్తున్నామ‌ని 93 మంది మాజీ ఐఎఎస్ లు మోదీకి లేఖ రాశారు. తాము ఏ పార్టీకి చెందినవారం కాద‌ని, ఏ పార్టీ స‌భ్యత్వంలేద‌ని.. కేవ‌లం రాజ్యాంగం మీద ఉన్న న‌మ్మకంతో ఈ లేఖ రాస్తున్నామ‌ని తెలిపారు. అభివృద్ధి పేరుతో ల‌క్షద్వీప్ లో దారుణ పరిణామాలు జ‌రుగుతున్నాయ‌ని, వాటి మీద ఆందోళ‌న చెంది ఈ లేఖ రాస్తున్నట్టు మోదీకి తెలిపారు. అడ్మినిస్ట్రేట‌ర్ ప్రపుల్ తీసుకున్న నిర్ణయాలు ల‌క్షద్వీప్ స్వరూపాన్ని, వాతావ‌ర‌ణాన్ని మార్చే విధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ల‌క్షద్వీప్ ప్రజ‌ల అభిప్రాయాల‌ను ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా అడ్మినిస్ట్రేట‌ర్ ఈ నిర్ణయాలు తీసుకున్నార‌ని తెలిపారు.

About Author