ఘనంగా ఎస్ డి పి ఐ 17వ ఆవిర్భవ దినోత్సవం
1 min read
న్యూస్ నేడుహొళగుంద: కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండల స్థానిక బస్టాండ్ సర్కిల్ నందు సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పతాకన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం అధ్యక్షులు ఎఫ్, అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ఎస్ డి పి ఐ గత 16 సంవత్సరాలుగా పార్టీ గళం లేని వారికి గళం కావాలన్న ఆశయంతో స్థాపించబడింది ఆకిలి నుండి స్వేచ్ఛ భయం నుండి స్వేచ్ఛ అనే నినాదంతో అన్ని వర్గాలకు ఆకలి భయాలను దూరం చేసే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా వాళ్ల యొక్క ఆశయ సాధనలకు నిరంతరం కృషి చేస్తూ 16 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిందని తెలిపారు నేడు 17వ ఆవిర్భవ దినోత్సవం జరుపుకుంటుందని తెలిపారు ఇది స్వేచ్ఛ సమానత్వం ధర్మ నిరుపేక్షతకు మద్దతుగా కొనసాగిన ఒక ప్రయాణం అన్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోది పాలనలో ప్రజాస్వామ్యం రూపకల్పన మాత్రమే మిగిలిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని కేంద్ర సంస్థలు ద్వారా వారిని వేధించడం జరుగుతుందన్నారు. మనం చూసినట్లయితే మా జాతీయ అధ్యక్షులు ఎం, కె, ఫైజి జైలులో ఉన్నారు ఆయన చేసిన తప్పు ఏమిటంటే నిజాలను నిర్భయంగా చెప్పడం అని అన్నారు. ఇలాంటి రాజకీయాలు కు విరుద్ధంగా మన రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ఈ సమావేశంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కె, సలామ్ . ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్. కార్యదర్శి హఫీజ్. కోశాధికారి అల్లా బకాష్ .కార్యవర్గ సభ్యులు కె. భాష హరూన్ అస్లాం నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.