సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సొంగా రోషన్ కుమార్ నిరంతరం కృషి
1 min read
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, వినతులు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను ఓర్పుతో విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.


