PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 మీటర్ల జాతీయ జెండాతో శ్రీ చైతన్య విద్యార్థుల ర్యాలీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక బుధవారపేట లోని శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా ‘జయహో భారత్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ రాఘవ లక్ష్మి తెలిపారు .సోమవారం ఉదయం పాఠశాల లో ర్యాలీ కార్యక్రమం నకు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏ జి ఏం సురేష్ ముఖ్య అథితిగా హాజరైనారు .ఈ సందర్బంగా సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయమని మరియు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారుకావలెనని సూచించారు .తదనంతరం విద్యార్థులు బుధవారపేట లోని పురవీధుల్లో 50మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు .ఈ కార్యక్రమం లో ఆర్ .ఐ వి .వెంకటేష్ ,డీన్ వీరయ్య ,అధ్యాపకబృందం ,విద్యార్థులు పాల్గొన్నారు .

About Author