యోగాంధ్ర కార్యక్రమంపై వీసీ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి
1 min read
వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జెసి.పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి గురువారం యోగాంధ్ర కార్యక్రమం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఈనెల 21వ తేదీన నిర్వహించే యోగాంద్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి విజయవంతం చేయాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుచేసుకునే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అదికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో 5445 ప్రాంతాల్లో ఈనెల 21వ తేదీన ప్రభుత్వం నిర్ధేశించిన యోగా ప్రోటోకాల్ ను నిర్వహించాలన్నారు. పేర్లు నమోదు చేసుకున్న పౌరులందరూ పాల్గొనేలా చొరవ చూపాలన్నారు. జిల్లాలో ఇంతవరకు 8,53,111 మంది యోగాంధ్ర కార్యక్రమం యాప్ లో తమపేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 6,29,191 మందికి సర్టిఫికెట్లు జారీచేయడం జరిగిందని, 1,82,644 మందికి ఎక్స్ లర్స్ సర్టిఫికెట్లు జారీచేశారన్నారు. అదే విధంగా ఈనెల 21వ తేదీన ఏలూరు నగరంలో జిల్లాస్ధాయి యోగా కార్యక్రమాన్నిసుమారు 6 వేల మందితో సర్. సి.ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు.అదే విధంగా ఏలూరులోని ఇండోర్ స్టేడియం, ఎఎస్ఆర్ స్టేడియంలో కూడా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. సమావేశంలో డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లాపరిషత్ సీఈఓ శ్రీహరి, డిఆర్డిఏ పీడీ విజయరాజు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎ. భానుప్రతాప్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, సెట్ వెల్ సీఈఓ కె.ఎస్. ప్రభాకర్,ఎస్సీ కార్పొరేషన్ ఈడి ముక్కంటి, ఆర్ఐఓ యోహాన్,ఆయుష్ డిడి లక్ష్మి శారద,డిఎంహెచ్ఓ డా.ఆర్.మాలిని, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
