విద్యార్థి బస్సు పునః ప్రారంభించాలి.. ఏఐవైఎఫ్
1 min read
పత్తికొండ, న్యూస్నేడు: కైరుప్పల,పుప్పాలదొడ్డి, బిల్లేకళ్ళు,జూటురు,చిన్నహుల్తీ మీదుగా పత్తికొండ కు వచ్చే విద్యార్థి బస్సు సౌకర్యం తిరిగి పునరుద్ధరించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులతో కలిసి డిపో ఇన్చార్జి గారికి వినతిపత్రo అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి రమంజిని, ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శి నజీర్ మాట్లాడుతూ, కైరుప్పల పుప్పాలదొడ్డి బిల్లేకల్లు జూటూరు చిన్నహుల్తి మీదుగా పత్తికొండకు విద్యార్థి బస్సు గత సంవత్సరంలో ఉండేది. ఈ సంవత్సరం పాఠశాలలు కాలేజీలు ప్రారంభమై 10 రోజులు పూర్తయిన ఇంకా విద్యార్థులకు విద్యార్థి బస్సు కల్పించ లేదని అన్నారు.రోజు విద్యార్థులు సర్వీస్ బస్సులో ప్రజలతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వెంటనే ఆ గ్రామాల మీదుగా బస్సును ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులను మరియు తల్లిదండ్రులను కలుపుకొని ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి మోహన్,ఎం ఈరన్న, లక్ష్మన్న ఎం.కె లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.