మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలకు విద్యార్థులు ఎన్నిక
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని కొమ్మెమర్రి ఆదర్శ ప్రాథమిక పాఠశాల కి చెందిన 9 మంది విద్యార్థిని విద్యార్థులు గత నెల 12 వ తేదీన జరిగిన పరీక్షలకు హాజరై నేడు వెలువడిన ఫలితాల్లో దూదేకుల అంజుం షెహనాజ్ 100 కి 93 మార్కులు తెచ్చుకుని జిల్లాలో 9 వ ర్యాంక్ సాధించి డోన్ లో ఉన్న MJPAPBCWR స్కూల్ & కాలేజీ లో అదేవిధంగా దూదేకుల ఆరిఫ్ బాషా 100 కి 87 మార్కులు తెచ్చుకుని జిల్లాలో 40 వ ర్యాంక్ సాధించి బేతెంచర్ల లో గల MJPAPBCWR స్కూల్ & కాలేజీ లో సీటు సంపాదించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ రహీం ,ఉపాధ్యాయులుఋ పురుషోత్తం,అశ్విని హర్షం వ్యక్తం చేస్తూ పిల్లలకు శుభాకాంక్షలు తెలియచేశారు.గ్రామస్తులు మరియు మండల విద్యాధికారులు మహేశ్వర రెడ్డి,వెంకటేష్ నాయక్ లు పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

