చౌటుకూరులో విద్యార్థులకు..స్టడీ మెటీరియల్ పంపిణీ
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : విద్యార్థులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనిచౌటుకూరు గ్రామ టీడీపీ నాయకులు నరసింహ గౌడ్, షబ్బు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టడీ మెటీరియల్ కిట్లను షబ్బు, గౌడ్ మరియు పాఠశాల చైర్మన్ చిన్న బాల మద్దిలేటి,ప్రధానోపాధ్యాయులు రవి ప్రకాష్ పంపిణీ చేశారు.విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్ దుస్తులు, బ్యాగులు,టెక్స్ట్ మరియు లాంగ్ నోట్ పుస్తకాలనుపంపిణీ చేశారు.ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభుదాస్, జగదీశ్వర్ రెడ్డి మరియు స్వాములు,విద్యార్థులు పాల్గొన్నారు.