భవిష్యత్ ప్రణాళికలో భాగంగా స్వర్ణాంద్ర విజన్-2047
1 min read
స్వర్ణాంద్ర విజన్-2047 వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆలూరు తాలూకా గౌ.శ్రీ.బి.వీరభద్ర గౌడ్
న్యూస్ నేడు ఆలూరు : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుతూ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా స్వర్ణాంద్ర విజన్-2047 చేపట్టడం జరిగింది.ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర మొత్తం ప్రభుత్వ అధికారుల తో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలూరు తాలూకా టిడిపి ఇంచార్జి వర్యులు గౌ.శ్రీ. బి.వీరభధ్రగౌడ్ కూడా ఆలూరు పట్టణంలో సచివాలయం-2లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి స్వర్ణాంద్ర విజన్-2047 ఆలూరు తాలూకా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో ఆలూరు తాలూకా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపిడిఓ మరియు సచివాలయ ఉద్యోగులు,ఇతర ప్రభుత్వ అధికారులుమరియు ఆలూరు పట్టణ,మండల టిడిపి నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలలో ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు.
