NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయితీ సోలార్ రూఫ్ టాప్ సద్వినియోగం చేసుకోండి

1 min read

మహానంది, న్యూస్​ నేడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై ఇళ్లపై నిర్మించుకోవడానికి వీలు గా రాయితీ సోలార్ రూఫ్ టాప్ అమలు చేస్తున్నాయని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి మహానంది మండల ప్రజలను కోరారు . మండలంలోని బొల్లవరం తమ్మడపల్లె, బుక్కాపురం తదితర గ్రామాల్లో గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఒక కిలోవాటుకు 120 యూనిట్లు, 2 కిలోవాట్లకు 240 యూనిట్లు, మూడు కిలో వాట్లకు 360 యూనిట్లు సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. 120 యూనిట్లకు ₹1000, 240 యూనిట్లకు ₹2, 000, 360 యూనిట్లకు ₹3, 000 చొప్పున ప్రస్తుతం విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. కానీ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏడాదికి 8 వేల నుండి దాదాపు 30 వేల రూపాయల వరకు వినియోగించే యూనిట్లను బట్టి ఆదా అవుతుంది అన్నారు. ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం 75, 000 రాష్ట్ర ప్రభుత్వం 20 వేల రూపాయలు సబ్సిడీ రూపంలో అందజేస్తున్నాయని, మిగతా మొత్తం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందే సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఏ ఈ ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లో వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు సబ్సిడీ రూపంలో ఈ అవకాశం ప్రభుత్వం కల్పించిందని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *