NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాగునీటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి…

1 min read

ఎమ్మెల్యేకు సిపిఎం వినతి……

పత్తికొండ, న్యూస్​ నేడు:  దేవనకొండ మండలంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, మండల  రైతాంగానికి  సాగునీటి అంశాల పరిష్కారానికి అండగా నిలవాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, పార్టీ మండల నాయకులు యూసుఫ్ భాష, పాండురంగడు ఆలూరు శాసనసభ్యులు     బి.విరుపాక్షికి వినతిపత్రంఅందజేశారు .            గురువారం దేవనకొండ మండల కేంద్రంలో ఒక కార్యక్రమ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా సిపిఎం బృందం ఎమ్మెల్యేను కలిసి మండలంలోని సాగునీటి అంశాలపై వినతిపత్రం అందజేస్తూ సాగునీటి అంశాల పరిష్కారానికి తమ వైపు నుండి  కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రధానంగా హంద్రీ నీవా నుండి మండలానికి 46 వేల ఎకరాలకు సాగు నీటి రావలసి ఉండగా పంట కాలువ నిర్మాణం లేనందున మండలంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా సాగు నీరు అందడం లేదని రైతులు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి సాగు నీరు ను సమకూర్చుకుంటున్నారని  పంట కాల్వల  నిర్మాణం పూర్తయితే 46 వేల ఎకరాకు  సాగునీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు అదేవిధంగా గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసీ  కోటకొండ మాచాపురం వరకు   కాలువను తీసుకోవడం ద్వారా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని 10 చెరువులకు పైగా సాగునీరు పైగా నీళ్లు మళ్లించా వచ్చని  పేర్కొన్నారు తద్వారా భూగర్భ జలాలు పెరిగి మరింతగా బోరు బావుల్లో నీటి ఊట కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు మండలంలో ప్రధాన సమస్యలైన పై రెండింటి సమస్యల పరిష్కారానికి శాసనసభ్యులుగా కృషి చేయాలని ఈ ప్రాంత రైతాంగానికి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు….. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సదరూ సమస్యలపై జిల్లా సమగ్ర అభివృద్ధి సమావేశాల్లోనూ సంబంధిత అధికారులతోనూ ఇప్పటికే మాట్లాడడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *