PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెప్పు తీసుకుని కొడతా !

1 min read

పల్లెవెలుగువెబ్ : వైసీసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు. వెధవల్లారా, సన్నాసుల్లారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను స్కార్పియో కొన్నా కూడా వాళ్లిచ్చారా, వీళ్లిచ్చారా అని వైసీపీ నేతలు అంటుంటారని… ఒరేయ్ వెధవల్లారా నేనెంత సంపాదిస్తానో మీకు తెలుసురా? అని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాల కాలంలో తాను ఆరు సినిమాలు చేశానని… రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల రూపాయలను సంపాదించానని రూ. 33,37,04,776ల ట్యాక్స్ కట్టానని పవన్ చెప్పారు. ఇది జీఎస్టీ కాకుండా అని తెలిపారు. తన బిడ్డల పేరిట వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి పార్టీ ఆఫీస్ పెట్టానని చెప్పారు. 2021-22 లో రూ. 5 కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చానని తెలిపారు. హుదూద్ తుపాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డు, పీఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా కలిపి దాదాపు రూ. 12 కోట్లు ఇచ్చానని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ. 30 లక్షలు ఇచ్చానని తెలిపారు. జనసేనకు ఐదు బ్యాంక్ ఖాతాలున్నాయని.. అందులో రూ. 17,58,06,323 కార్పస్ ఫండ్ ఉందని పవన్ చెప్పారు. కేవలం రైతు భరోసా కోసం రూ.3,50,78,226ల ఉందని చెప్పారు. మొన్న తన పుట్టిన రోజు కోసం జనసైనికులు చేయాలనుకున్న కార్యక్రమం కోసం వచ్చిన విరాళాలు రూ. 4,32,19,395లు అని వెల్లడించారు. ప్యాకేజ్, ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి నా కొడులు ఎవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క వైసీపీ నా కొడుని చెప్పు తీసుకుని కొడతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పగిలిపోయేలా, దవడ వాచి పోయేలా అటు తిప్పి, ఇటు తిప్పి కొడతానని హెచ్చరించారు. తమాషాగా ఉందా కొడరా? అంటూ విరుచుకుపడ్డారు. ఇంకొకసారి ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానని వార్నింగ్ ఇచ్చారు. పళ్లు రాలగొడతా కొడరా అంటూ హెచ్చరించారు. తన కాలికి ఉన్న చెప్పును చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు.

            

About Author