PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాండ్ర,గౌరులను కలిసిన టిడీపీ నాయకులు

1 min read

-వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఉమాదేవి దంపతులను అల్లూరు గ్రామంలో వారి నివాసం దగ్గర నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం మిడుతూరు టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,టిడిపి మండల నాయకులు తలముడిపి వంగాల శివరామిరెడ్డి,మండల యువ నాయకులు యరభం ప్రమోద్ రెడ్డి,సుభాన్ వివిధ గ్రామాల నాయకులు సంపంగి రవీంద్ర బాబు,టి రమణారెడ్డి, మాజీ సర్పంచులు వెంకటేశ్వర రెడ్డి,నాగేంద్రుడు,ఐటీడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ నూతన సంవత్సర సందర్భంగా పూల బోకేలు అందజేస్తూ కేక్ కట్ చేశారు.తర్వాత కర్నూలు లో నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులను వీరు కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు మండల కన్వీనర్ రమేష్ రెడ్డి తెలిపారు అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతి కార్యకర్త గ్రామంలో తిరిగి టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శివానందరెడ్డి మరియు గౌరు వెంకటరెడ్డి కార్యకర్తలకు సూచించినట్లు కాతా రమేష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల టిడిపి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author