వక్ఫ్ బిల్లును రద్దు చేసే వరకు పోరాటం ఆగదు..
1 min read
టీడీపీ,జనసేన ముస్లింలపై కపట ప్రేమ
విజయవంతమైన మైనార్టీల నిరసన ర్యాలీ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేయడాన్ని ముస్లింలు ఖండించారు.వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని ముస్లిం మైనార్టీ సమాజాన్ని బలహీన పరిచేలా కేంద్రం కుట్ర పన్నుతోందని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలాన రఫీక్ జామయి అన్నారు. బుధవారం నందికొట్కూరు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీ విజయవంతం అయింది ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ బిల్లును అమలు కానివ్వమని చట్ట ప్రకారం కోర్టుల ద్వారా దాన్ని వక్ఫ్ బిల్లును అమలు కాకుండా అడ్డుకుంటామని అన్నారు.వక్ఫ్ బిల్లు చట్టం, చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ మొదలు పెట్టిందని, కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ సుప్రీంకోర్టు వివరణ కోరిందని వివరించారు.విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని అవి మొదటి కేసును విచారించాలా? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా? అని పేర్కొన్నదని అన్నారు.ఆర్టికల్ 25,26 లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపామని వారు అన్నారు. వక్ఫ్ అనేది అల్లాహ్ ఆస్తి అని ముస్లింలు ఆ ఆస్తి సంరక్షకులని అన్నారు అటువంటి అల్లా ఆస్తి బాధ్యత కలెక్టర్కు ఇచ్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.ముస్లిం మైనార్టీలను అణిచివేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేసేంతవరకు పోరాడుతామని,వక్ఫ్ బిల్లును రద్దు చేయని పక్షంలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలాన రఫీక్ జామయి,జేఏసీ కో కన్వీనర్ మౌలానా మహబూబ్ బాష రషాది,జేఏసీ నాయకులు అబుబక్కర్,సలాం ఖాన్, దౌలత్ భాష అబ్దుర్రహ్మన్, మహబూబ్ బాష,అబ్దుల్ రహిమాన్,ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు నాగేశ్వరరావు, నరసింహులు, రఘు రామమూర్తి,పిక్కిలి వెంకటేశ్వర్లు,రమేష్ బాబు,రజిత,షాజహాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తేనే నాగరాజు,వివిధ గ్రామాల మౌలానాలు, ముతవల్లిలు,భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.