NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు అభివృద్ధి పథమే ధ్యేయం ..అదే ఎంపీ లక్ష్యం

1 min read

ప్రతి అడుగు ప్రజల కోసం.. ప్రగతి కోసం అహర్నిశలు కృషి

ఏడాదిలోనే ప్రగతికి బాటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

గత ప్రజా ప్రతినిధులను మరిపించేలా పాలన సాగిస్తున్నారంటూ కొనియాడుతున్న ప్రజలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​నేడు : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి బలహీన వర్గానికి చెందిన యువకుడైన పుట్టా మహేష్ కుమార్ ను చట్టసభకు పంపించి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం చరిత్రను తిరగరాసే అవకాశం కల్పించారు. పుట్టా మహేష్ కుమార్ ను తమ వాడిగా అక్కున చేర్చుకున్న ప్రజలు ఆశీర్వదించి భారీ 1,81,857 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిపించారు. పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎవరికి ఇవ్వని అవకాశం ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చి ఆదరణ చూపించారు. ఇక్కడి ప్రజలు కేవలం ఓటు మాత్రమే కాదు వారి విశ్వాసం, మద్దతు, ప్రేమ, ఆశీర్వాదం కురిపించారు. తనపై ఉంచిన నమ్మకానికి విలువనిచ్చేలా నిరంతరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని కర్తవ్యంగా భావించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శ్రమిస్తున్నారు. రానున్న నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్ష మేరకు మరెన్నో అభివృద్ధి మైలురాళ్లు అధిగమించడం కోసం ముందుకు సాగుతున్నారు. ప్రతి క్షణం, ప్రతి అడుగూ, ప్రజల కోసం, ప్రగతి కోసం పరితపించే వ్యక్తి తమ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కావడం పట్ల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు..

పొగాకు రైతులకు వెన్ను దన్ను

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునిల్ బర్త్వల్ ను కలిసి పొగాకు రైతుల సమస్యలు వివరించారు. నిబంధనలు సడలించి పంట ఉత్పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వల్ల వర్జీనియా పొగాకు రైతులకు రూ.110 కోట్ల లబ్ది చేకూరింది.కొల్లేరు ప్రాంత వాసులకు ఊరటఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా కొల్లేరు సమస్య పరిష్కారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కోసం కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ న్యాయ నిపుణులతో దిల్లీ వేదికగా చర్చించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్య పరిష్కరించాలని విన్నవించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కలిసి కొల్లేరు సమస్య  వివరించారు.

ఎంపీ చొరవతో సమస్యల పరిష్కారం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చింతలపూడి మండలం  ప్రగడవరంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తక్షణం స్పందించి ప్రగడవరంలో తాగునీటి పైపులైన్, యుద్ధ ప్రాతిపదికన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ. 1000 కోట్లతో చేపట్టే 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఇటీవల పరిపాల ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటిని నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *