NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేషన్ ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం..

1 min read

ఎంఎల్ఎస్ పాయింట్ ను తనిఖీ చేసిన సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు..

న్యూస్ నేడు నందికొట్కూరు: రేషన్ ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న మండల్ లెవెల్ రేషన్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్)ను మహేష్ నాయుడు మరియు సివిల్ సప్లై డైరెక్టర్ కొంకతి లక్ష్మీ నారాయణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.రేషన్ డీలర్లకు బియ్యం సంచులు 50 కేజీలకు గాను 43,44 కేజీల బియ్యం వస్తూ ఉన్నాయని వీటిలో చాలా తేడా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటే కిందిస్థాయిలో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయని అన్నారు. ఎంఎల్ఎస్ లో అవినీతి జరిగితే సహించేది లేదని లారీలో సివిల్ సప్లై ముద్ర ఉన్న సంచులను తీసుకెళ్లకుండా ప్లాస్టిక్ సంచుల్లో బియ్యం తీసుకువెళ్లడం పట్ల స్టాక్ పాయింట్ అధికారులపై డైరెక్టర్ మహేష్ నాయుడు అసహనం వ్యక్తం చేశారు. రేషన్ సక్రమంగా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ప్రతి బియ్యం సంచి 50 కేజీలు ఉండాల్సిందేనని అధికారులతో అన్నారు.వీటిపై విచారణ చేయిస్తామని  రికార్డులను పరిశీలించి నివేదికను పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని డైరెక్టర్ మహేష్ నాయుడు పాత్రికేయులతో అన్నారు.ఈ కార్యక్రమంలో స్టాక్ పాయింట్ అసిస్టెంట్ డీఎం ముంతాజ్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *