పొగాకు రైతులు ఇబ్బందులు పడ్డారు..
1 min read
కరెంట్ కోతలతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
సర్వసభ్య సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి
మిడుతూరు-గార్గేయపురం రోడ్డు బాగు చేయండి..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివారు.మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్ మాట్లాడుతుండగా సహకార సొసైటీలో రాబోయే రబీకి ముందుగానే నాణ్యమైన విత్తనాలు ఫర్టిలైజర్ ఎక్కువ స్టాక్ ఉంచుకోవాలని రైతులకు కావలసిన వాటిని మార్కెట్ తరపున సహకారం అందిస్తామని ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి ఎంఏఓకు సూచించారు.అదేవిధంగా సబ్సిడీ విత్తనాలు ఇంకా ఎక్కువగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పొగాకు కంపెనీ వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాలని అన్నారు.కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను సరిచేయాలని విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కుమార్ కు సూచించారు.మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న రోడ్డు అధ్వానంగా ఉందని అదేవిధంగా పీరు సాహెబ్ పేట రోడ్డు మరియు మిడుతూరు గారేయపురం రోడ్డు గుంతల మయంగా ఉండటంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురి అవుతున్నారని రోడ్లను బాగు చేయాలని మీరు మండలంలో పర్యటించారు ఎప్పుడో వస్తారు వెళ్తారంటూ ఆర్అండ్ భీ ఏఈ మనోధర్ ను ప్రజా ప్రతినిధులు నిలదీశారు. జలకనూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో 110 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం 47 మంది మాత్రమే ఉన్నారని అందరూ ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని కనీసం పాఠశాలల వైపు చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ ఎంఈఓ ఫైజున్నిసా బేగంను గ్రామ సర్పంచ్ కురువ ఎల్లయ్య ప్రశ్నించారు.రాస్తా లేని పొలాలకు రస్తా ఇవ్వమని జీవో వచ్చింది గత ఆరు నెలలుగా తిరుగుతునన్నా పొలాల రస్తాలకు దారి చూపడం లేదని గ్రామంలో లేనిపోని సమస్యలు తహసిల్దార్ సృష్టిస్తున్నారంటూ తలముడిపి సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి దశరథ రామయ్య,అంగన్వాడీ సీడీ పీఓ మంగవల్లి,వైస్ ఎంపీపీ నభి రసూల్,ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ విశ్వనాధ్,ఏపీఎం సుబ్బయ్య,అంగన్వాడీ సూపర్వైజర్లు వరలక్ష్మీ,రేణుకా దేవి,ఎక్సైజ్ ఎస్సై జఫురుల్లా, డాక్టర్ వ్యోమకేష్ మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.