విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి ఘన నివాళులు
1 min read
ఆలూరు, న్యూస్ నేడు : ఆలూరు తాలూకా యువ నాయకులు గౌ.శ్రీ.బి.గిరిమల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో…విశ్వవిఖ్యాత నట సార్వభౌమ,నటరత్న,పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలోనియోజకవర్గ మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియు తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు అలాగే తెలుగుయువత, ఐటిడిపి , టిఎన్ఎస్ఎఫ్, టియన్టియుసి, టిడిపి శోషల్ మీడియా మరియు టిడిపిఅనుబంధ సంఘాల పసుపు సైనికులు,కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.