NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల దేవుళ్ల ఆశీస్సులతో ఐదో సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి గా వస్తా

1 min read

జగన్ నవరత్న పథకాలు సంతృప్తి – బాబు సూపర్ సిక్స్ పథకాలు అసంతృప్తి

ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసుకోండి వారి అంతు చూస్తాం

కూటమి ఏకమైన నన్ను ఓడించలేదు

 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైకాపా దే అధికారం

మంత్రాలయం న్యూస్​ నేడు :  రాఘవేంద్ర స్వామి, ప్రజల దేవుళ్ల ఆశీస్సులతో ఐదో సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి గా వస్తా అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి  పిలుపు మేరకు బుధవారం మంత్రాలయం లో  వెన్నుపోటు దినం కార్యక్రమం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అబౌడీ హోటల్  నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాఘవేంద్ర సర్కిల్ లో ఆయన మాట్లాడుతూ  చంద్రబాబు హయాంలో ముగ్గురు ముఖ్య టిడిపి పార్టీ నాయకులు ప్రచారం చేసిన నా ప్రజల దేవుళ్లు వాళ్ల ను కాదని నా మీద నమ్మకం తో నన్ను గెలిపించారని వారి రుణ పడి ఉంటానని అన్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే చెప్పిన మాట ప్రకారం నవరత్నాలతో పాటు మరెన్నో మంచి పథకాలను ప్రజలకు అందించారని దీంతో ప్రజలు సంతోషంగా జీవించారని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక పోతున్నారని దీంతో ప్రజలే కాక టిడిపి నాయకులు కార్యకర్తలు కూడా అసంతృప్తి లో ఉన్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా సానుభూతి పరులంటు 199 మంది అధికారులను వేధింపులకు గురి చేయడం జరిగిందన్నారు ఇటీవల జరిగిన మినీ మహానాడులో  నా గురించి మాట్లాడిన వ్యక్తులు గతంలో చినాన్న, చినాన్న అని ఇప్పుడు నన్నే విమర్శిస్తున్నారని ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని నాయకులు, కార్యకర్తలు కూడా ఎవ్వరైన ఇబ్బంది పెడితే వారి పేర్లను రాసి పెట్టుకోండని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ల అంతు చుద్దామని పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి తహసీల్దార్ రవి కి పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం ను అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి,సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు హోటల్ పరమేష్, మాజీ ఉప సర్పంచ్ గోరుకల్ కృష్ణ, మల్లికార్జున, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *