మనిషి జీవితంలో యోగా భాగం కావాలి
1 min read
జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య
కర్నూలు జిల్లా బ్యూరో న్యూస్ నేడు: మనిషి జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని, యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య పేర్కొన్నారు.సోమవారం ఉదయం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామం బ్రహ్మ కుమారి మ్యూజియం లో యోగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21న విశాఖపట్నం లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. జిల్లాలో మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ ను నెల రోజులపాటు యోగా కార్యక్రమాలను నిర్వహించుకున్నారు.. యోగా సాధనతో మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతల నుండి విముక్తి లభిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో యోగా కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని జేసీ తెలిపారు..ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు.. మండల స్థాయిలో యోగా కాంపిటీషన్ కి సంబంధించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి పోటీల్లో పాల్గొనేలా అవకాశం కల్పించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ప్రజలందరినీ యోగ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తూ చైతన్య పరచాలని జేసీ పిలుపునిచ్చారు.అనంతరం యోగా ట్రైనర్లు కార్యక్రమానికి హాజరైన వారితో ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేయించారు.కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్, జిల్లా పర్యాటక శాఖ అధికారి విజయ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, ఎంపిడిఓ, తహసీల్దార్, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, బ్రహ్మ కుమారీ లు, యోగభ్యాసకులు, అధికారులు పాల్గొన్నారు.
