వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 28వ డివిజన్ లో మజ్జిగ పంపిణీ
1 min read
ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లిపాక సురేష్ ఆధ్వర్యంలో కండ్రిగూడెం సెంటర్లో వేసవికాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.మజ్జిగ పంపిణీ కార్యక్రమం నకు ముఖ్యఅతిథి గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి )చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు,పాల్గొని విజయవంతం చేశారు.


