PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బతుకు భద్రతను గెలిపించుకోండి

1 min read
బుధవార పేటలో ప్రచారం చేస్తున్న సీపీఎం నాయకులు

బుధవార పేటలో ప్రచారం చేస్తున్న సీపీఎం నాయకులు

భయంతో, డబ్బుతో, బందు ప్రీతితో, అధికార ధర్పం తో గిరిగీసిన బతుకు గీతలను బద్దలు కొట్టండి..
– సిపిఎం జిల్లా నాయకులు యం.డి. ఆనంద్ బాబు
పల్లెవెలుగు, కర్నూలు
మున్సిపల్​ ఎన్నికల్లో కమ్యునిస్టు అభ్యర్థులను గెలిపించి.. బతుకు భద్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపిఎం జిల్లా నాయకులు యం.డి. ఆనంద్ బాబు అన్నారు. బుధవారం నగరంలోని 15 వ వార్డ్ బుధువార పేట లోని చర్చి ముందు వెనకాల సందులు, మధ్య గేరి, ప్రతాప్ లైన్, సత్యమయ్య సందు, మారెమ్మ గుడి, మాలపేట ఏరియాలలో సిపిఎం అభ్యర్థి రెడ్డి పోగు కేశమ్మ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ కోట్ల నోట్ల రంగులేసుకున్న రాబందులన్నీ ఓట్లకోసం మన ముందు కొస్తున్నాయని, వంగి మొక్కినా రాక్షసత్వం వంట పట్టించుకున్న వారి బుద్ది మారదన్నారు. ఇప్పటికైనా ఆలోచించి సుత్తి కొడవలి సుక్కకు ఓటేసి మన బతుకు భద్రత ను గెలిపించుకుందామని ఆయన ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో 15 వ వార్డ్ సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి రెడ్డి పోగు కేశమ్మ, నగర నాయకులు ఆర్ కృష్ణ, కె రామకృష్ణ, వార్డ్ నాయకులు రాముడు, జాకీ శీను, లక్ష్మన్న, శ్రీరాములు, గొట్టం రమేష్, సామేల్, ఆర్ చంద్ర, శ్రీనివాసులు, రాజు, ప్రకాష్, రాము, మధు, మహేంద్ర, వినయ్, అంజి మహిళా నాయకులు దరూరు విజయ, మహేశ్వరి, రాములమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author