దేవస్థానంలో షెడ్లు నిర్మాణానికి 50,116 రూ. విరాళం
1 min read
శుక్రవారం సందర్భంగా విశేష పూజలు మరియు
10.6.25న 76వ చండీహోమం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మ వారిఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) సారథ్యంలోఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మాణం శర వేగంగా కొనసాగుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా,డాక్టర్ రాజాన మాట్లాడుతూ,కీ.శే.నౌడు రామన్న నారాయణమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు గంగరాజు, సత్య నూకరాజు కుటుంబ సభ్యులు రూ 50,116/ లు,మానవత తిరుపతి త్రిపుర రమేష్ కుటుంబ సభ్యులు రూ 50,116/లు విరాళంగా అందజేశారు.వారికి అమ్మ వారి చిత్రపటాన్ని శేష వస్త్రాన్ని యిచ్చి వేద మంత్రాలతో ఘనంగా సత్కరించారు.వారిని వారి కుటుంబ సభ్యుల విద్యా,ఉద్యోగ, వ్యాపారాలు మరియు వృత్తి,వ్యవసాయాలను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని అన్నారు. అమ్మ వారి చిత్ర పటాన్ని శేష వస్త్రాన్ని యిచ్చి ఘనంగా సత్కరించామని అన్నారు.ప్రతీ పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా చండీ హోమం నిర్వహిస్తున్నామని, జేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ది.10.6.25 మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆలయ యాగశాల నందు 76వ చండీ హోమం జరుగుతుందని, పాల్గొన దలచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. శుక్రవారం సందర్భంగా అమ్మ వారికి విశేష అలంకరణలు, ఉత్సవ మూర్తికి పంచామృతాలు, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకలు నిత్య పూజా కైంకర్యాలు మరియు సాయం సంధ్యా హారతి పూజాలు అర్చక స్వాములు నిర్వహించారు.శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం చిట్లూరి సుబ్బరావు ఆధ్వర్యంలో పులిహోర,చల్లటి మజ్జిగను వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గొట్టిముక్కల వంశీ కుమార్ రాజు, చిట్లూరి సర్వేశ్వరరావు,పసుమర్తి సత్తిరాజు,కేతిరెడ్డి వెంకట రమణ,పైల చంటి, దల్లి శ్రీనివాసరెడ్డి,మహిళా కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.