ప్యాపిలి లో పదవ తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థినీలు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలో 89.33% పదవ తరగతి ఉత్తీర్ణత శాతం నమోదు అయినట్లు ప్యాపిలి విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర నాయిక్, మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 14 ప్రభుత్వ పాఠశాలల్లో 741 విద్యార్థులు పదవ పరీక్షలు రాయగ 662 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మండలంలో మొదటి మూడు ర్యాంకులు వరుసగా 1.పి.రాగ నిత్య 587 మార్కులు ఏనుగుమర్రి పాఠశాల2.జె. సుస్మిత 582 మార్కులు జలదుర్గం3.కె. వర్షిణి 581 మార్కులు జలదుర్గం4.పద్మావతి 581 మార్కులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ప్యాపిలి లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి తమకు విద్యా బోధన అందించి ఉపాధ్యాయులకు,తమ తల్లిదండ్రుల కు సొంత గ్రామానికి పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన పేరు తేచ్చి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

