రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ లసంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని పురస్కారాలు అందించనున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ లయన్స్ క్లబ్ అఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి,నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్యం రచనలు కథలు కవితలు వ్యాసాల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలు అందించిన వారికి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య ప్రతిభా పురస్కారానికి అర్హులని, విద్యార్థుల అభివృద్ధి మరియు బోధనలో అత్యుత్తమ సేవలు అందించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మరియు కళాశాలల మరియు శిక్షణ కేంద్రాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ అవార్డుకు అర్హులని,25 సంవత్సరాలు పైగా సాహిత్య సేవలు అందించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కు అర్హులని ఆసక్తిగలవారు ఐదవ తేదీ సాయంత్రంలోగా తమ దరఖాస్తులను వెంకటరమణ కాలనీ మొదట లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో అందజేయాలని వివరాలకు 9396861308 నెంబర్ కు సంప్రదించవచ్చని తెలిపారు.

