NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్సార్సీపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎరుకల రాజు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  వైయస్సార్సీపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు  గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసినటువంటి నూతన బాధ్యతలలో కర్నూలు జిల్లా కు చెందిన వై రాజును రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా వై రాజు మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను ఇప్పించినందుకు మా నాయకులు పెద్దలు గౌరవనీయులు నంద్యాల వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు పాణ్యం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కి రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు యువ నాయకులు శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి కి మరియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంత రెడ్డి కి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పెద్ద ఎత్తున ఎస్టీలను పార్టీకి అనుసంధానం చేస్తానని తెలుపుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

About Author