NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ డే సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

1 min read

: డిప్యూటీ తహశీల్దార్ నిజాముద్దీన్

హోళగుందన్యూస్ నేడు: హోళగుందమండల తహశీల్దార్ కార్యాలయంలో  రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను అందిస్తున్న శాఖ అని తెలిపారు.ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు, ఆదాయ, కుల, నివాస ధృవపత్రాల జారీ, భూ రికార్డుల నిర్వహణ వంటి సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, ప్రజా సమస్యల పరిష్కారంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి ప్రజా సేవా దృక్పథంతో పనిచేసి ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని రెవెన్యూ డే ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *