20 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ లంకా ధినకర్ ఏలూరు రాక
1 min read
మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ చౌటుపల్లి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరెళ్ల సుధాకర్ కృష్ణ , పార్లమెంట్ కన్వీనర్ కట్నేని లక్ష్మీ కృష్ణ
జిల్లాలో పలు సమస్యలపై వినతి పత్రం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బుధవారం 20 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ లంకా ధినకర్ ఏలూరు విచ్చేసిన సందర్బంగా రెవిన్యూ గెస్ట్ హౌస్ నందు ఆయనను మర్యాదపూర్వకంగా ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ చౌటుపల్లి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరెళ్ల సుధాకర్ కృష్ణ, పార్లమెంట్ కన్వీనర్ కట్నేని లక్ష్మీ కృష్ణ ప్రసాద్ కలిశారు.వారితోపాటు జిల్లా ప్రధాన కార్యదర్శి గాది రాంబాబు మరియు బిజెపి శ్రేణులు ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో పలు సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని బిజెపి ఏలూరు జిల్లా మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు తెలిపారు.

